ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య

వర్ధన్నపేట, వెలుగు : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ ‌‌ జిల్లా వర్ధన్నపేట మండలంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పోశాల రాజబాబు (45) మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజబాబు బుదవారం రాత్రి ఊరి చివర ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య సువర్ణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సువర్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.