
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైల్వేలైన్ మార్కింగ్ కోసం శుక్రవారం సర్వే చేస్తున్న అధికారులను స్థానిక రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. తమ భూముల్లో నుంచి రైల్వే లైన్ వద్దంటూ మంత్రి పొంగులేటికి, ఎంపీ నామా నాగేశ్వరరావుకు వినతిపత్రాలు అందజేశారు. ఆందోళన చేపట్టినవారిలో రైతులు చింతలపూడి శ్రీనివాసరావు, బెల్లం రామారావు, చింతలపూడి రామారావు, బెల్లం జెగన్, గద్దల వెంకటేశ్వర్లు, ఇంటూరి వెంకటేశ్వర్లు, బెల్లం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.