![గ్రీన్ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్న రైతులు](https://static.v6velugu.com/uploads/2025/02/farmers-protest-against-green-field-highway-at-warangal-district_i4FxhrMICe.jpg)
- పంట నష్టపరిహారం ఇచ్చే వరకు చేయొద్దంటూ ఆందోళన
నెక్కొండ, వెలుగు: పంట నష్టపరిహారం ఇచ్చేదాకా గ్రీన్ఫీల్డ్హైవే పనులను అడ్డుకుంటామని భూములు కోల్పోయిన రైతులు ఆందోళన చేపట్టారు. వరంగల్జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లిలో సోమవారం గ్రీన్ ఫీల్డ్హైవే పనుల్లో భాగంగా రైతులకు సమాచారం ఇవ్వకుండా సాగుచేసిన పంటలను జేసీబీ, ప్రొక్లెయిన్ తో ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్నారు. 15 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలను కూడా చెడగొడుతుండగా ఆఫీసర్లకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఏసీపీ కిరణ్కుమార్, సీఐ శ్రీనివాస్,ఆర్డీవో ఉమారాణి సిబ్బందితో వెళ్లి కాంట్రాక్టర్తో పనులు చేయించారు. రెండు నెలలు సమయం ఇస్తే.. పంటలు చేతికి వస్తాయని రైతులు కోరినా వినలేదు. 15మంది రైతులు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. ఆఫీసర్లు మాత్రం నష్టపరిహారం ఇస్తామని, పనులను అడ్డుకోవద్దని రైతులకు సూచించగా వెనుదిరిగారు.