పొన్కల్ లో .. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు రైతుల ఆందోళన

 పొన్కల్ లో .. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు రైతుల ఆందోళన

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలంలోని పొన్కల్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట సోమవారం రైతులు ఆందోళన చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంతో ఈ బ్యాంకులోనే రూ.లక్ష రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ నిధులు తక్కువగా రావడంతో ధర్నాకు దిగారు.

గ్రామానికి వచ్చిన వ్యవసాయ అధికారులకు రైతులకు గోడు విన్నవించుకోగా వారు మేనేజర్​ను వివరాలు అడిగారు. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని, భయపడాల్సిన అవసరం లేదని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బ్యాంక్ మేనేజర్ పేర్కొన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు.