ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..

ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లజర్ల వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను రికవరీ చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.