ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు మృతి

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‎లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (అక్టోబర్ 26) మధ్యాహ్నం శింగనమల మండలంలోని నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద అనంతపురం-కడప హైవేపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‎మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

 అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  యాక్సిడెంట్ జరగడంతో అనంతపురం-కడప హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
ALSO READ | పెళ్లి మండపం నుంచి పెళ్లి కుమార్తె జంప్ : ఆగిన పెళ్లితో పెళ్లికుమారుడి బంధువుల గొడవ