ఓఆర్ఆర్ దగ్గర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి

ఓఆర్ఆర్ దగ్గర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బీటెక్  విద్యార్థులు మృతి

 హైదరాబాద్ దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర  రోడ్డుపై ఆగి ఉన్న లారీని స్కోడా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో  వీఎన్ఆర్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు.  మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  కారు కుత్బుల్లాపూర్ నుంచి దుండిగల్  వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ఘటనతో కాసేపు  రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని  స్థానిక మల్లారెడ్డి హస్పిటల్  కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.  మృతదేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రకి తరలించారు. కారు అతి వేగమే  ప్రమాదానికి కారణం అని  తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.