ప్రైవేట్ బస్సుల్లో డ్రగ్స్ సరఫరా ..తండ్రీ కొడుకులు అరెస్ట్

ప్రైవేట్ బస్సుల్లో డ్రగ్స్ సరఫరా ..తండ్రీ కొడుకులు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా రాచకొండ పీఎస్ పరిధిలో డ్రగ్స్ కేసులో తండ్రీ కొడుకులిద్దరూ పట్టుబడ్డారు. మహేశ్వరం జోన్ SOT,బాలాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సినీ ఫక్కీ తరహాలోడ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రీ కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హనీఫ్ గతంలో డ్రగ్స్ కేసులో ముంబై లో అరెస్ట్ అయ్యడు.. హనీఫ్ కొడుకు సిద్ధిక్ తండ్రితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. 

తండ్రీ కొడుకులు మధ్య ప్రదేశ్ ,ముంబై మీదుగా హైదరాబాద్ కు రవాణా చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల ద్వారా నగరానికి చేరుకొని స్థానిక కాంటాక్ట్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.  నిందితుల నుంచి 100 గ్రామల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు  రాచకొండ సీపీ సుధీర్ బాబు.