నిర్మల్​ జిల్లాలో విద్యుత్ షాక్​తో తండ్రి మృతి.. కొడుకుకు తీవ్రగాయాలు

నిర్మల్​ జిల్లాలో విద్యుత్  షాక్​తో తండ్రి మృతి.. కొడుకుకు తీవ్రగాయాలు

పెంబి, వెలుగు: విద్యుత్ షాక్ తో తండ్రి చనిపోగా, కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకా రం.. నిర్మల్​ జిల్లా పెంబి మండలం నాగపూర్  గ్రామానికి చెందిన రాపెల్లి మైసయ్య(42) కొంత భూమి కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు.

పంటలో లైటింగ్​ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్  తీగలు తగిలి షాక్​కు గురయ్యాడు. పక్కనే ఉన్న కొడుకు రాపెల్లి మహేశ్(20) తండ్రిని కాపాడబోయి అతను కూడా షాక్ కు గురయ్యాడు. తండ్రి అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయలైన మహేశ్​ను ఖానాపూర్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్  తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.