సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన తండ్రి

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన తండ్రి

సంగారెడ్డి: తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో యువకుడిని బాలిక తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న ఓ బాలికతో దశరథ్(26) చనువుగా ఉండటంతో బాలిక తండ్రి గోపాల్ అతడిపై కక్ష పెంచుకున్నాడు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న గోపాల్.. తన కూతురుతో సన్నిహితంగా ఉంటున్న దశరథ్‎ను అంతమొందించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే దశరథ్‎ను హత్య చేశాడు గోపాల్. నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.

అనంతరం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‎లో గోపాల్ లొంగిపోయాడు. దశరథ్ కుటుంబ సభ్యులు మృతదేహం కోసం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడు దశరథ్‎కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త నాలుగు రోజులుగా కనిపించడం లేదంటూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు  చేసింది. దశరథ్ ను హత్య చేసినట్లు గోపాల్ అంగీకరించడంతో.. పోలీసులు మృతదేహాం కోసం వెతుకుతున్నారు.