కవ్వాల్ టైగర్ జోన్ లో ఎఫ్​డీపీటీ పర్యటన

కవ్వాల్ టైగర్ జోన్ లో ఎఫ్​డీపీటీ పర్యటన

జన్నారం,వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లోని ఇందన్ పెల్లి రేంజ్ లో ఎఫ్​డీపీటీ శాంతారామ్  శుక్రవారం పర్యటించారు. రేంజ్ లోని గ్రాస్​ ల్యాండ్ తో పాటు,  అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులకు   రికార్డులను తనిఖీ చేశారు.   పెండింగ్​ పనులను,  చేపట్టబోయే పనులను  తెలుసుకున్నారు. 

జంతువుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఆయన వెంట మంచిర్యాల డీఎఫ్​వో శివ్ ఆసీన్ సింగ్ ,ఇందన్ పెల్లి రేంజ్ ఆఫీసర్ హఫీజోద్దిన్తదితరులున్నారు.