రెడీమిక్స్​ లారీ ఢీకొట్టిన ఘటనలో గాయత్రి మృతి

రెడీమిక్స్​ లారీ ఢీకొట్టిన ఘటనలో గాయత్రి మృతి
  • ఇదే యాక్సిడెంట్​లో గాయపడిన భవాని
  • ఈ నెల 11న మృతి 

శామీర్ పేట, వెలుగు: శామీర్​పేట మండలం బిట్స్ చౌరస్తాలో రెడీమిక్స్​లారీ ఢీకొని తీవ్రంగా గాయపడిన కొరివి గాయత్రి(24) ఆదివారం చనిపోయింది. ఇదే ఘటనలో గాయపడిన కొరివి భవాని(19) కొంపల్లి శ్రీకర హాస్పిటల్​లో చికిత్స పొందుతూ ఈనెల 11న చనిపోయింది. తర్వాత మెరుగైన చికిత్స కోసం గాయత్రిని మరో హాస్పిటల్​కు తరలించారు. 

ఏడు రోజులుగా మృత్యువుతో పోరాడిన గాయత్రి ఆదివారం రాత్రి కన్నుమూసింది. గాయత్రి, భవాని అన్నదమ్ముల పిల్లలు. వీరిద్దరూ తిరుమలగిరిలోని కంపెనీలో డ్యూటీకి వెళ్లేందుకు ఈ నెల 10న బిట్స్​చౌరస్తాలోని బస్టాప్​కు వచ్చారు. బస్సు కోసం చూస్తుండగా అదే టైంలో దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది.