మ్యూచువల్​ ఫండ్స్​లో తగ్గిన పెట్టుబడులు .. గత నెల 26 శాతం డౌన్​

మ్యూచువల్​ ఫండ్స్​లో తగ్గిన పెట్టుబడులు .. గత నెల 26 శాతం డౌన్​

న్యూఢిల్లీ: మార్కెట్ పడుతుండడంతో ఈక్విటీ మ్యూచువల్  ఫండ్స్‌‌లోకి వచ్చే పెట్టుబడులు కిందటి నెలలో భారీగా తగ్గాయి.   ఏడాది లెక్కన 26 శాతం తగ్గి రూ.29,303 కోట్లకు చేరాయి. స్మాల్​, మిడ్​క్యాప్ ​స్కీమ్స్​కు ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలోనూ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. సిస్టమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ప్లాన్స్​(సిప్​) ఇన్​ఫ్లోలు ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి చేరుకొని రూ.25,999 కోట్లుగా నమోదయ్యాయి. జనవరి సిప్​ఇన్​ఫ్లో రూ.26,400 కోట్లు కాగా, డిసెంబరులో రూ.26,459 కోట్లు ఉంది. 

 అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఈక్విటీ- ఆధారిత ఫండ్లకు జనవరిలో రూ. 39,688 కోట్లు, డిసెంబర్‌‌‌‌లో రూ. 41,156 కోట్లు వచ్చాయి.  జనవరిలో మిడ్  స్మాల్-క్యాప్ ఫండ్లలో ఇన్​ఫ్లో వరుసగా రూ.5,147 కోట్లు,  రూ.5,720 కోట్లు ఉండగా,  ఫిబ్రవరిలో రూ.3,406 కోట్లు,  రూ.3,722 కోట్లకు తగ్గింది. లార్జ్-క్యాప్ ఫండ్లలో ఇన్‌‌‌‌ఫ్లోలు జనవరిలో రూ.3,063 కోట్ల నుంచి రూ.2,866 కోట్లకు తగ్గాయి. థీమాటిక్ ఫండ్లలో అత్యధికంగా రూ.5,711 కోట్ల నికర ఇన్‌‌‌‌ఫ్లో ఉంది. ఫ్లెక్సీ ఫండ్లలో రూ.5,104 కోట్ల ఇన్​ఫ్లో ఉంది.  గత నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ రూ. 6,525 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నాయి.