- 429 కోట్లు కొల్లగొట్టిన కేసులో చర్యలు
హైదరాబాద్, వెలుగు: క్యాష్బిన్ లోన్ యాప్ సంస్థ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రై.లిమిటెడ్(పీసీఎఫ్ఎస్)కు చెందిన రూ.252.36 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ ) జప్తు చేసింది. అటాచ్మెంట్కు సంబంధించిన వివరాలను ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు గురువారం వెల్లడించారు. నార్వేలోని ఒపెరా గ్రూప్ అనుబంధ సంస్థగా ఉన్న పీసీఎఫ్ఎస్ ప్రై.లిమిటెడ్, ఆన్లైన్ లోన్యాప్ ద్వారా లోన్స్ ఇచ్చేది. నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీ వసూలు చేయడంతో పాటు అప్పు తీసుకున్న వారిని తీవ్రంగా వేధించింది.
ఈ సంస్థ చైనా కంపెనీల నియంత్రణలో పనిచేస్తోంది. లోన్యాప్స్ ద్వారా రూ.429.30 కోట్లు కొల్లగొట్టింది. వాటిని విదేశాల్లోని షెల్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించింది. దాంతో ఫెమా చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రూ. 252.36 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. దీనిపై పీసీఎఫ్ఎస్ కంపెనీ ఈడీకి వ్యతిరేకంగా అప్పిలేట్ ఫోరమ్లో పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు చేపట్టిన అప్పిలేట్ ఫోరం ఈడీ చర్యలను సమర్థిస్తూ ఈ నెల 7వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పీసీఎఫ్ఎస్కు చెందిన రూ. 252.36 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడంతో పాటు కంపెనీపై అదనంగా జరిమానా విధించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.