ఈమె ఫైనాన్స్ కంపెనీలో రూ.20 కోట్లు కొట్టేసి పారిపోయింది.. కనిపిస్తే చెప్పండి

ఈమె ఫైనాన్స్ కంపెనీలో రూ.20 కోట్లు కొట్టేసి పారిపోయింది.. కనిపిస్తే చెప్పండి

ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న మహిళ రూ.20 కోట్లు కాజేసి పరారైంది. ఈ ఘటన కేరళ రాష్ర్టంలోని వలప్పాడ్  లో చోటుచేసుకుంది. తిరుమల కొల్లాంలో నివసించే ధన్య మోహన్ అనే మహిళ 18ఏళ్లగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తుంది. ఆమె కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.20 కోట్ల వరకు డిజిటల్ పర్సనల్ లోన్లు తీసుకొని కనిపించకుండా పారిపోయింది. దీంతో ఫైనాన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న ధన్యమోహన్ ని వెతుకుతున్న పోలీసులు లుక్ ఔవుట్ నోటీసులు జారీ చేశారు.