చెన్నూరులో అక్రమంగా  ఎరువు బస్తాలు సీజ్

చెన్నూరులో అక్రమంగా  ఎరువు బస్తాలు సీజ్

మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో ని  63వ జాతీయ రహదారిపై అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న ఎరువు బస్తాలను పోలీసులు  పట్టుకున్నారు.  మొత్తం నాలుగు వాహనాల్లో తరలిస్తున్న 150 బస్తాల డీఏపీ, 2020, వీటితో యూరియా బస్తాలను సీజ్ చేశారు. రైతులను మోసగించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఎరువులను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఎరువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.