
- ఆర్ఎఫ్సీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ఉదయ్ రాజహంస వెల్లడి
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్నుంచి 2024 –-25 ఆర్థిక సంవత్సరంలో 11.70 లక్షల మెట్రిక్టన్నుల యూరియా రవాణా చేసినట్టు ఆర్ఎఫ్సీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ రాజహంస తెలిపారు. 400వ రేక్ద్వారా యూరియాను సప్లై చేస్తున్న రైలును గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ దేశంలో వ్యవసాయోత్పత్తిని పెంచడం కోసం రైతులకు అందుబాటు ధరలకు సకాలంలో యూరియాను అందించడానికి ఆర్ఎఫ్సీఎల్కృషి చేస్తుందన్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా యూరియాను రాష్ట్రంతో పాటు ఏపీ, చత్తీస్గడ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవాలకు సప్లై చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర పరిపాలన శాఖ, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ, కేంద్ర రైల్వే శాఖకు, వాటాదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.