
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్కు ఫిక్కి (ఫెడరేషన్ఆఫ్ ఇండియన్ చాంబర్స్ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అవార్డు దక్కింది. స్మార్ట్ పోలీసింగ్ విభాగంలో సైబర్ క్రైమ్ మేనేజ్ మెంట్లో భాగంగా ఆయనకు స్పెషల్ జ్యూరీ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలో జరిగింది. 16 రాష్ట్రాల్లోని 23 సంస్థల నుంచి 129 ఎంట్రీలు రాగా, తెలంగాణకు చెందిన మల్లేశంను ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. తనకు సహకరించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.