
ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్ మీద భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు 28: ఫీల్డ్ సూపర్వైజర్(సేఫ్టీ)
ఎలిజిబిలిటీ: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి మార్చి 23వ తేదీకి 29 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మార్చి 23.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.