
బోయినిపల్లి, వెలుగు: బోయినిపల్లి మండలం తడగొండ లో నీళ్లు లేక పొలాలు ఎండుతున్నాయి. ఇప్పటికే చెరువుతోపాటు, బోరు బావుల్లో నీళ్లు అడుగంటాయి. గ్రామంలో సుమారుగా 1200 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. గ్రామానికి డీ 4 కాలువ ద్వారా ఫాజుల్ నగర్ మినీ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేవారు.
ఇప్పటికే ఒకసారి విడుదల చేసినప్పటికీ అవి సరిపోకపోవడంతో రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ఎండిన పొలాల్లో గొర్రెలను మేపుతున్నారు.