
పద్మారావునగర్, వెలుగు: బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులు వ్యాపార మెళుకులవలను నేర్చుకోవాలని, సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ అవుతారని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. శుక్రవారం పద్మారావునగర్ లోని సర్దార్ పటేల్ డిగ్రీ, పీజీ కాలేజీ లో ప్రారంభమైన రెండు రోజుల బిజినెస్ మేనేజ్మెంట్ ఫెస్ట్ సమన్వయ-2025 కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు.
కాలేజీ ఆవరణలో ఫుడ్ స్టాల్స్ ను, ఆయా కార్పొరేట్ కంపెనీలు తమ ప్రొడక్ట్ స్టాల్స్ లను ఏర్పాటు చేశారు. కాలేజీ చైర్మన్ పి.హరినాథ్ రెడ్డి, కార్యదర్శి జీవి.రంగారెడ్డి, ట్రెజరర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డా.హేమలత,డా.అమర్నాథ్,రాహుల్ యాదవ్, అనుప యాదవ్, పల్లవి,రమేశ్, సిబ్బంది పాల్గొన్నార