ఆ దర్శకుడితో సినిమా చెయ్యాలని ఉందంటున్న కల్కి చిత్రం నిర్మాత..

ఆ దర్శకుడితో సినిమా చెయ్యాలని ఉందంటున్న కల్కి చిత్రం నిర్మాత..

టాలీవుడ్ లో దాదాపుగా 20కి పైగా చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై  అశ్వనీదత్ నిర్మించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా అశ్వనీదత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

ALSO READ | నేను ప్రభాస్ ని ఆ ఉద్దేశంతో అనలేదు:బాలీవుడ్ నటుడు

ఇందులో భాగంగా ప్రముఖ సక్సస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళితో సినిమా చెయ్యాలని ఉందని తన మనసులోని మాటని బయట పెట్టాడు. అలాగే గతంలో ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకేకించిన స్టూడెంట్ నెం 1 చిత్రానికి తానే ప్రజెంటర్ గా ఉన్నానని కానీ ఇప్పుడు రాజమౌళి రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. అలాగే రాజమౌళి కూడా ఇతర చిత్రాలతో బిజీ గా ఉండంతో సినిమా చెయ్యడం కుదరలేదని చెప్పాడు.దీంతో రాజమౌళితో సినిమా చేయాలనే ఆశ ఇప్పటికీ అలాగే  ఉండిపోయిందని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా సినీ నిర్మాత అశ్వనీదత్ దాదాపుగా 40 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే అశ్వనీదత్ దాదాపుగా రూ.400 కోట్లు వెచ్చించి నిర్మించిన కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ. 1150 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో ప్రస్తుతము కల్కి రెండో భాగంపై అశ్వనీదత్  దృష్టి సారిస్తున్నారు.