ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు..ఐదేండ్లు కొనసాగిన విచారణ 

ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు..ఐదేండ్లు కొనసాగిన విచారణ 

నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి.. 1600 పేజీల్లో చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది.

అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్థారించారు. 2019 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌12న చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దానిపై ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సుమారు ఐదు సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా.. పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ సమర్పించిన చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోపాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును నేడు వెలువరించేందుకు రిజర్వు చేసింది.

ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హత్యకేసులో ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ2 బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సుభాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, ఏ3 అజ్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అలీ, ఏ4 అబ్ధుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బారీ, ఏ5 ఎంఏ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏ7 శివ, ఏ8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మారుతీ రావు(ఏ-1) 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ కేసు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుభాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (ఏ-2), అస్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ(ఏ-3) విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు.