సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఘటన

సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఘటన

ఝరాసంగం, వెలుగు : ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొందిలి ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (60), కళావతి (50) దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. వీరంతా కేతకీ సంగమేశ్వర ఆలయం ముందు హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడుపుతూ జీవిస్తున్నారు. కొన్ని నెలలుగా హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కళావతి ఆదివారం సాయంత్రం తమ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పొలం వద్దకు వెళ్లే సరికే ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయి కనిపించారు. వెంటనే 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. మృతుడి తమ్ముడు సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.