ఝరాసంగం, వెలుగు : ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొందిలి ప్రతాప్సింగ్ (60), కళావతి (50) దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. వీరంతా కేతకీ సంగమేశ్వర ఆలయం ముందు హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. కొన్ని నెలలుగా హోటల్ సరిగా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రతాప్సింగ్, కళావతి ఆదివారం సాయంత్రం తమ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పొలం వద్దకు వెళ్లే సరికే ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయి కనిపించారు. వెంటనే 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. మృతుడి తమ్ముడు సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఘటన
- మెదక్
- October 21, 2024
లేటెస్ట్
- తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..
- టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దామోదర్రెడ్డి
- తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం...78 యూనిట్ల రక్తసేకరణ
- ఎస్సీ బాయిస్ హాస్టల్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
- ఎమ్మెల్సీ కోదండారాంను కలిసిన షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు
- వికారాబాద్ జిల్లా అభివృద్దికి VUDA ఏర్పాటు
- పేద విద్యార్థికి అండగా సాఫ్ట్వేర్ ఉద్యోగి
- ఓసీపీ ఓబీ కాంట్రాక్టర్ జీతాలు ఇస్తలేడు .. కాంట్రాక్ట్డ్రైవర్లు, హెల్పర్లు ఆవేదన
- నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి స్టోర్ రూమ్ లో మంటలు...తప్పిన ప్రమాదం..
- కొండపర్తిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
Most Read News
- మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..
- ఒక్క హిట్ పడగానే రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నాడా..?
- రాహుల్ స్థానంలో అతన్ని తీసుకోండి.. కష్టాల్లో ఆదుకోగలడు: మాజీ క్రికెటర్
- గేమ్ ఛేంజర్ లో మరో టాలీవుడ్ హీరో..
- Diwali 2024: దీపావళి ఐదు రోజుల పండుగ... ప్రాముఖ్యత.. ఆచారాలు ఇవే..
- టెక్నాలజీ : వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. ఒకసారి ట్రై చేయండి
- రతన్ టాటా పట్టిందల్లా పసిడే
- HYDRA: ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
- అందరూ బుమ్రా అంటారు కానీ, పస లేదు.. మా బౌలర్ అతనికంటే గొప్ప: పాక్ పేసర్
- సీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్