
- హంతకుడికంటే పిల్లల విక్రేత ప్రమాదకరమని వ్యాఖ్య
ఢిల్లీ: తప్పిపోయిన ఆరుగురు పిల్లలు ఎక్కడున్నా వెతికి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పిల్లల్ని అక్రమ రవాణా చేసేవాళ్లు హంతకులకంటే ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది. నవజాత శిశువుల విక్రయాలు జరుగుతున్నాయని పత్రికల్లో వచ్చిన వార్తలను జస్టిస్ బె.బి.పార్థివాలా, జస్టిస్ ఆర్.మాధవన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ సుమోటాగా విచారణకు స్వీకరించింది.
ఈ విషయంలో పిల్లల్ని అమ్మేవాళ్లు, కొనేవాళ్లు బాధ్యతగా ఉండాలని సూచించింది. అలాంటి వాళ్లు సమాజానికి పెను ముప్పు అని పేర్కొంది. 'ఒక వ్యక్తి హత్య చేసేడానికి ఒక కారణం ఉండవచ్చు. మరోసారి అతడు హత్య చేయకపోవచ్చు. కానీ పిల్లల విక్రయాలకు పాల్పడే వాళ్లు ఆ నేరాలు పదే పదే చేస్తారు' అని వ్యాఖ్యానించింది.