అదనపు కలెక్టర్, డీఎస్‎వో, డీటీపై ఎఫ్‎ఐఆర్.. నిజామాబాద్​ జిల్లాలో హాట్​టాపిక్​

 అదనపు కలెక్టర్, డీఎస్‎వో, డీటీపై ఎఫ్‎ఐఆర్.. నిజామాబాద్​ జిల్లాలో హాట్​టాపిక్​

హైదరాబాద్: రూ.72 కోట్లు సీఎంఆర్​బకాయిలతో డిఫాలర్ట్​లిస్టులో బీఆర్ఎస్​నేత, బోధన్​మాజీ ఎమ్మెల్యే షకీల్​ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నిజామాబాద్​జిల్లాలో పనిచేసిన ముగ్గురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో అదనపు కలెక్టర్​చంద్రశేఖర్, డీఎస్ వో చంద్రప్రకాశ్, డీటీ నికిల్​రాజ్‎పై ఎఫ్‎ఐఆర్​నమోదు చేశారు. షకీల్‏కు క్లీన్​చీట్​ఇచ్చేందుకు ధాన్యం అక్రమ బదిలీ చేయడంపై ఈ ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వర్నికి చెందిన మిల్లర్​కిషోర్​న్యాయపోరాటంతో అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అధికారులపై కేసుల వ్యవహారం జిల్లాలో హాట్​టాఫిక్‎గా మారింది. ​