Harsha Sai Arrest: యూట్యూబర్ హర్ష సాయి పై కేసు నమోదు.. ఈసారి జైలు తప్పదా.?

Harsha Sai Arrest: యూట్యూబర్ హర్ష సాయి పై కేసు నమోదు..  ఈసారి జైలు తప్పదా.?

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం మరో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులోభాగంగా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పలు సెక్షన్ల క్రింద హర్ష సాయిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

అంతేగాకుండా తాను కేవలం కొందరి వ్యక్తులకి మాత్రమే వ్యతిరేకం కాదని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నవాళ్ళందరితో పోరాడుతున్నామని తెలిపాడు.. అలాగే సోషల్ మీడియా లోని ఫాలోవర్స్ ని అడ్డుపెట్టుకుని కొందరు తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని దీంతో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పకొచ్చాడు. అలాగే ప్రజలు కూడా ఈజీ మనీ కోసం కాకుండా కష్టపడి పని చెయ్యాలని సూచించాడు. 

ఇక హర్ష సాయి గురించి మాట్లాడుతూ "చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు!

ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు. 

ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి." అంటూ ఎక్స్ లో పేర్కొన్నాడు.