రాహుల్పై వివాదాస్పద కామెంట్స్.. శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

రాహుల్పై వివాదాస్పద కామెంట్స్.. శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు శివసేన (ఏక్‌నాథ్  వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై బుల్దానా సిటీ పీఎస్ లో కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ ప్రకారం సెక్షన్  351(2), 351(4), 192, 351(3)  ప్రకారం కేసు ఫైల్ చేశారు.

రాహుల్ గాంధీ ఇటీవల రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అమెరికా టూర్‎లో రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై  ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్  సెప్టెంబర్ 16న  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది.. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ రాహుల్ అసత్య  ప్రచారాలు చేస్తున్నారు.. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తా అంటూ సంజయ్ గైక్వాడ్  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎప్పుడు రాజ్యాంగ పుస్తకాన్ని చూపించి బీజేపీ దానిని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేశారు.. కానీ దేశాన్ని 400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాలని యోచిస్తుంది కాంగ్రెస్ పార్టీనే అని గైక్వాడ్ విరుచుకుపడ్డారు.

ALSO READ | రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా.. శివసేన ఎమ్మెల్యే షాకింగ్ ఆఫర్