
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2023 ఆగస్టు 24 గురువారం తెల్లవారుజామున కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. షోరూమ్లోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వచ్చాయి. కొద్ది సమయంలోనే మంటలు అటు గోదాముకూ విస్తరించాయి. దీంతో షోరూమ్ తో పాటుగా అందులో ఉన్న 300 బైక్స్ దగ్ధమయ్యాయి.
విజయవాడలోని చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో వందల సంఖ్యలో వాహనాలు గోదాముల్లో ఉంచుతారు.
అయితే బైక్ షోరూంతో పాటు సర్వీస్ సెంటర్లను కూడా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో గోడౌన్, షోరూం, సర్వీస్ సెంటర్ కూడా ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు అక్కడ ఉంటాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మూడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిసట్లుగా తెలుస్తోంది.