
మాదాపూర్, వెలుగు: మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప సొసైటీ మెయిన్రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి సమీపంలోని బిల్డింగ్ ఐదో అంతస్తులో నిపుణ్ఐటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్పేరుతో ఐటీ కంపెనీ నడుస్తోంది. బుధవారం న్యూఇయర్సందర్భంగా హాలిడే ఇవ్వడంతో ఉద్యోగులు ఎవరూ ఆఫీసుకు రాలేదు. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో నిపుణ్ఆఫీసు నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇన్వెర్టర్ బ్యాటరీలు కాలిపోవడంతో మంటలు చెలరేగినట్లు ఫైర్ ఆఫీసర్ మహ్మద్ ఫైజల్ తెలిపారు.