
కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్ కూకట్పల్లి వివేకానందనగర్ లోని పల్లవి రెస్టారెంట్లో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది శ్రీనివాస్ఆర్పేందుకు ప్రయత్నించగా స్వల్ప గాయాలయ్యాయి. నేమ్ బోర్డులో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్సర్య్కూట్కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.