
జడ్చర్ల, వెలుగు: మౌలాలి నుంచి రాయిచూర్ వెళ్తున్న గూడ్స్ రైలులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. శుక్రవారం రాయిచూర్ వెళ్తున్న గూడ్స్లో మంటలు రావడం గమనించిన లోకో పైలెట్లు జడ్చర్ల స్టేషన్లో నిలిపివేశారు. అంతకుముందే ఫైర్ స్టేషన్కుసమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. రైల్వే ఉన్నతాధికారులు వచ్చిన తరువాత నష్టం అంచనా వేసి వివరాలు వెల్లడిస్తారని రైల్వే అధికారులు తెలిపారు.