మిలాద్ ర్యాలీలో అపశృతి... చార్మినార్ దగ్గర ఎగసిపడ్డ మంటలు..

మిలాద్ ర్యాలీలో అపశృతి... చార్మినార్ దగ్గర ఎగసిపడ్డ మంటలు..

మిలాద్ ఉన్ నబి సందర్బంగా నిర్వహిస్తున్న మిలాద్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది... హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ దగ్గర  అల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ అద్వర్యంలో నిర్వహిస్తున్న మిలాద్ ర్యాలీ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ర్యాలీలో ఓ యువకుడు టపాసులు కాల్చటంతో నిప్పు రవ్వలు డీజే సౌండ్ సిస్టమ్ లోని జెనరేటర్ పై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

సంఘటన స్థలంలోనే  ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.