స్కూల్ బస్సులో మంటలు.. భయంతో పిల్లల కేకలు..

స్కూల్ బస్సులో మంటలు.. భయంతో పిల్లల కేకలు..

కామారెడ్డి: ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు రేగిన ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంతో మంటలు రేగి పొగలు వ్యాపించాయి. దీంతో.. బస్సులో వెళ్తున్న విద్యార్థులు భయానికి లోనై కేకలు వేశారు. అప్రమత్తమైన స్థానికులు బస్సును ఆపి పిల్లలను కిందికి దింపారు.

బస్సు మొత్తం పొగ వ్యాపించి పిల్లలు భయపడడంతో స్థానికులు ఓదార్చారు. ఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.  కామారెడ్డిలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.