రన్నింగ్ బైక్ లో మంటలు : ఇందిరాపార్క్ రోడ్డుపై కలకలం

రన్నింగ్ బైక్ లో మంటలు : ఇందిరాపార్క్ రోడ్డుపై కలకలం

హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కలకలం రేగింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డుపై బైక్ లో మంటలు చెలరేగడంతో అటు వైపుగా వెళుతున్నవారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బైక్ పై వెళుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అప్రమత్తమై.. బైక్ ను పక్కన ఆపి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. 

Also Read :- మావోయిస్టులకు ఎదురుదెబ్బ

 సమాచారం అందుకు అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  దీంతో ఇందిరాపార్క్ వద్ద ట్రాఫిక్ స్థంభించింది.  వాహనంలో సాంకేతిక సమస్య తలెత్తడం వలన మంటలు చెలరేగాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.