
నాచారం.. మల్లపూర్ పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీ ఆవరణలో అగ్నిప్రమాదం జరిగింది. ఆరిజన్ పరిశ్రమకు చెందిన స్క్రాప్ తగలబడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద తీవ్రతకు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.