
జమ్మూలోని సాంబ జిల్లాలో ఉన్న పల్లి అనే గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా నిలిచింది. ఈ గ్రామం మొత్తం సౌరశక్తి ఆధారిత గ్రామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2022 ఏప్రిల్ 24న ఈ గ్రామంలో 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ను ప్రారంభించారు. కేవలం మూడు వారాల కాలపరిమితితో ఈ ప్లాంటు రూపుదిద్దుకుంది. మొత్తం 6408 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1500 సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పంచాయతీలోని 340 ఇళ్లకు విద్యుత్ను అందిస్తున్నారు. కార్బన్ న్యూట్రాలిటీ అంటే సున్నా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను సాధించడాన్ని సూచిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తొలగింపును సమతుల్యం చేయడం ద్వారా కార్బన్ న్యూట్రల్ అనే పదాన్ని శక్తి ఉత్పత్తి, రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం విషయంలో ఉపయోగిస్తారు.