తొలి స్వదేశీ మానవ రహిత బాంబర్​ విమానం

తొలి స్వదేశీ మానవ రహిత బాంబర్​ విమానం

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవరహిత బాంబర్ విమానం ఎఫ్​ డబ్ల్యూడీ 200బీ తొలిసారిగా విజయవంతంగా గగనవిహారం చేసింది. బెంగళూరుకు చెందిన ఫ్లయిండ్​ వెడ్జ్​ డిఫెన్స్​ అండ్​ ఏరోస్పేస్​(ఎఫ్​డబ్ల్యూడీఏ) సంస్థ దీన్ని రూపొందించింది. ఈ విమానం సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ఏడు గంటలపాటు నింగిలోనే ఉండగలదు. ఇది నిఘా కోసం ఆప్టికల్​ పరికరాలు, గగనతల దాడులు, బాంబింగ్​ కోసం క్షిపణి తరహా ఆయుధాలను మోసుకెళ్తుంది. దీని ఏరోడైనమిక్స్​ డిజైన్​, ఎయిర్​ ఫ్రేమ్​, ప్రొపల్షన్​, నియంత్రణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్​ను ఎఫ్​డబ్ల్యూడీఏ కర్మాగారంలోనే రూపొందించారు.

ఈ విమానం బరువు 102 కిలోలు, గరిష్టంగా 250 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదు.