
- 1969, జనవరి 5న ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్ స్టేషన్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.
- ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన రామదాసు అనే యువకుడు పాల్వంచ థర్మల్ కేంద్రంలో జరిగిన అన్యాయాలను మొదట వెలుగులోకి తెచ్చాడు.
- పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్లో దినసరి వేతన కార్మికుడు కృష్ణ నిరాహార దీక్ష ప్రారంభించాడు.
- 1969, జనవరి 8న పాల్వంచ పట్టణంలోని గాంధీచౌక్ వద్ద బీఏ విద్యార్థి రవీంద్రనాథ్ నిరాహార దీక్ష ప్రారంభించారు.
- 1969, జనవరి 8న పాల్వంచ పట్టణంలో రవీంద్రనాథ్ అనే బీఏ విద్యార్థితోపాటు ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కవిరాజమూర్తి నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
- 1969, జనవరి 19న నిజామాబాద్ పట్టణంలో పాఠశాలలు, కాలేజీలు బహిష్కరించి, విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు.
- ఖమ్మంలో రవీంద్రనాథ్తోపాటు 9 సంవత్సరాల విద్యార్థిని అనురాధ కూడా నిరాహార దీక్ష ప్రారంభించారు.
- 1969, జనవరిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్ని కాలేజీల విద్యార్థి సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది.
- 1969, జనవరి 15 నుంచి సమ్మె చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి.
- 1967లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జైపాల్రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమ్మె చేశారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1969, జనవరి 13న తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది. మల్లికార్జున్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరే తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితికి నిజాం కాలేజీ కేంద్ర స్థానంగా ఉంది.
- తెలంగాణ రక్షణలను కోరే విద్యార్థి వర్గానికి కోఠిలోని వివేకవర్ధిని కాలేజీ కేంద్రంగా నిలిచింది.
- 1969, జనవరి 16న విద్యార్థులు హైదరాబాద్లో ఊరేగింపులు జరిపారు.
- స్వాతంత్ర్య సమరయోధుడు కాటం లక్మీనారాయణ తెలంగాణ పరిరక్షణల కమిటీ చైర్మన్గా వ్యవహరించారు.
- ముల్కీ నిబంధనలు అటానమస్ సంస్థలు, కార్పొరేషన్లకు వర్తించవని హైకోర్టు తీర్పునివ్వడంతో జనవరి 16న పాల్వంచ పట్టణంలో ఉద్యమం తీవ్రమైంది.
- ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ నగరంలో విద్యార్థులపై 1969, జనవరి 18న మొదటిసారి లాఠీఛార్జీ జరిగింది.
- తెలంగాణలో పనిచేస్తున్న ఆరు వేల మంది నాన్ ముల్కీలు ఆంధ్రాకు వెనక్కి పంపకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులు 1969, జనవరి 18న అల్టిమేటం ఇచ్చారు.
- ఉద్యమం నేపథ్యంలో 1969, జనవరి 19న అఖిలపక్ష ఒప్పందం జరిగింది.
- అఖిలపక్ష ఒప్పందం ప్రకారం లెక్కలు తీయగా తెలంగాణలో పనిచేస్తున్న నాన్ ముల్కీల సంఖ్య 4500 మందిగా తేలారు.
- నాన్ ముల్కీలను ఆంధ్రాకు తరలించడానికి 1969, జనవరి 21న ప్రభుత్వం జీవో నం 36 జారీ చేసింది.
- జీవో నంబర్ 36ను ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వ్యతిరేకించారు.
- జీవో 36 ను సవాల్ చేస్తూ ఆంధ్రా ఉద్యోగులు 1969, జనవరి 29న హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
- ముల్కీ నిబంధనలు చెల్లవు అని, జీవో 36ను రద్దు చేస్తూ 1969, ఫిబ్రవరి 3న హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ చిన్నపరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
- ముల్కీ నిబంధనలు సక్రమమేనని, అవి చెల్లుతాయని హైకోర్టు డివిజన్ బెంచ్ 1969, ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చింది.
- 1969, జనవరి 19న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధుల కోసం కుమార్ లలిత్ కమిటీ ఏర్పాటు చేసింది.
- కుమార్ లలిత్ కమిటీ లెక్క ప్రకారం 1956 నుంచి 1968 మధ్య తెలంగాణపై ఖర్చు పెట్టాల్సి ఉండి ఖర్చు పెట్టకుండా రూ.34.10కోట్లు మిగిలిపోయాయి.
- 1969 ఉద్యమంలో తొలి అమరుడు మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన శంకర్.