న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 4.8 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతం ఉండొచ్చని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.11.54 లక్షల కోట్లు అప్పులు తీసుకుంటామని వెల్లడించారు.
నాన్-–ఫైనాన్షియల్ సెక్టార్లలో రెగ్యులేటరీ మార్పులు తీసుకురావడం కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని ప్రకటించారు. కార్పొరేట్ బాండ్లకు క్రెడిట్ను అందించడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవెలప్మెంట్ ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల ఇండెక్స్ను ఈ ఏడాదే విడుదల చేస్తామని పేర్కొన్నారు.