ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ ఊర చెరువులో 25 కిలోల భారీ చేప చిక్కింది. సోమవారం జాలరి దేవీదాస్ చేపలు పడుతుండగా వలలో పడింది. ఇంత బరువు చేప చిక్కడం అరుదని.. ఇది బొచ్చ రకానికి చెందినదని దేవీదాస్ చెప్పారు.