![లాభాల పేరుతో మోసం ఐదుగురు అరెస్టు](https://static.v6velugu.com/uploads/2025/02/five-arrested-for-running-fake-investment-scheme-in-munagala_6UlZhJR71N.jpg)
మునగాల, వెలుగు: తక్కువ రోజులలో ఎక్కువ మొత్తం లో డబ్బులు సంపాదించవచ్చని ప్రచారం చేసిన ఐదుగురిని మునగాల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మునగాల సర్కిల్ సీఐ రామ కిష్ణారెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని బరాఖత్గూడెం గ్రామానికి చెందిన ఏనుగుల శంకర్ రావు, బేతం ప్రభాకర్ రెడ్డి, గండు యల్లయ్య , అజయ్, రెడ్డిపల్లి బుచ్చిబాబు, కేతావత్ మూన్ సింగ్, అలీన్ తో కలిసి సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ , కూసుమంచిలో ఆర్జీఎ ఆఫీసులు ఓపెన్ చేశారు.
దీని ద్వారా అమాయకులైన ప్రజలకు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రచారం చేశారు. ఈ స్కీమ్ గురించి ఎక్కువగా ప్రచారం చేసి డబ్బులు సంపాదించవచ్చని నమ్మించారు. ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి దానిలో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. వారిని అరెస్ట్ చేసి వారి నుంచి 3.5 లక్షలు , 5సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.