సూర్యాపేటలో ఘోర ప్రమాదం... ఐదు గేదెలు మృతి

సూర్యాపేటలో ఘోర ప్రమాదం...  ఐదు గేదెలు మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో  2024 జులై 02వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  జాతీయ రహదారి 365పై గేదెల లోడుతో వెళుతున్న డీసీఎంను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు గేదెలు మృతి చెందాయి. భద్రాద్రి కొత్తగూడెం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎంలో 20 గేదెలను తీసుకువెళ్తున్నారు.  కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం డ్రైవర్  రోడ్డుపై డీసీఎంను అపాడు.  ఈ క్రమంలో వేగంగా వచ్చిన లారీ డీసీఎంను ఢీకొట్టింది. ఘటన స్థలాని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.