లక్ష్మీదేవిపల్లి మండలంలో ఐదుగురు నకిలీ విలేకర్లు అరెస్ట్

లక్ష్మీదేవిపల్లి మండలంలో ఐదుగురు నకిలీ విలేకర్లు అరెస్ట్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విలేకర్లమంటూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్​ చేసినట్లు కొత్తగూడెం వన్​ టౌన్​ సీఐ కరుణాకర్​ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు విలేకర్లమని చెబుతూ ముఠాగా ఏర్పడి ప్రజలను డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టుగా పోలీసుల దృష్టికి వచ్చిందని తెలిపారు. విచారణ చేపట్టగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్​ కాలనీకి చెందిన ఏలూరి రాజేశ్

కొత్తగూడెం పట్టణంలోని బర్లీఫీట్ కు చెందిన దాసరి సాంబశివరావు, చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డ్​ కాలనీకి చెందిన గుంటూరు శ్రీనివాసరావు, రుద్రంపూర్​ ప్రాంతానికి చెందిన మేకల రమేశ్, కొత్తగూడెం పట్టణం మేదరబస్తీకి చెందిన బాదావత్​గణేశ్​ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలిందని పేర్కొన్నారు. దీంతో వారిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.