ఉప్పల్ భగాయత్​లో 5 కిలోల గంజాయి సీజ్​

ఉప్పల్ భగాయత్​లో 5 కిలోల గంజాయి సీజ్​

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ భాగయత్​ లో ఎండు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్​ చేశారు.  అల్వాల్, వెంకటాపురానికి  చెందిన అభిషేక్ కుమార్ సింగ్  బైక్​పై 5.147  కిలోల ఎండు గంజాయిని రవాణ  చేస్తుండటంతో సమాచారం అందింది. దీంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించారు.  ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి ఎండు గంజాయిని తెచ్చి,  సిటీలో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని ఎక్సైజ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ బి.ఓంకార్ తెలిపారు.