
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇవాళ(గురువారం, మార్చి 13, 2025) రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు అందించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు 5 ఏకగ్రీవం కానున్నాయనేది ముందు నుంచి తెలిసిన విషయమే.
ఈ స్థానాలకు 3 ప్రధాన పార్టీల నుంచి ఒక్కో సీటుకు ఒక్కో నామినేషన్ దాఖలు కాగా.. ముగ్గురు ఇండిపెండెంట్లు నామినేషన్ ఫైల్చేశారు. అయితే, ఇండిపెండెంట్ల నామిషన్లు నిబంధనలకు లోబడి లేకపోవడంతో ప్రధాన పార్టీలకు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం.
Also Read:-మంచిర్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..
కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్నాయక్, విజయశాంతి.. సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం.. బీఆర్ఎస్నుంచి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం ఎన్నికైన.. అద్దంకి దయాకర్, శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ నల్గొండ జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్ 3, దాని మిత్రపక్షమైన సీపీఐ ఒకటి, బీఆర్ఎస్ ఒక సీటును గెలుచుకున్నాయి.