
- పార్ట్ –ఏ లో 90 ప్రశ్నల కింద 5 ఆప్షన్లు
- ఓఎంఆర్ షీట్ లో కేవలం నాలుగు బబుల్స్మాత్రమే!
- కన్ఫ్యూస్ అయిన స్టూడెంట్స్
- రాష్ట్ర విద్యాశాఖ తీరుపై విమర్శలు
- పరీక్ష రద్దు చేసే చాన్స్
మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో తొమ్మిది నుంచి 12 వరకు చదివే పేద స్టూడెంట్లకు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ కోసం ఆదివారం స్టేట్వైడ్నిర్వహించిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ ) పరీక్షలో బ్లండర్ జరిగింది. ఇందుకోసం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తయారుచేసిన పార్ట్ –ఏ పేపర్లో 90 ప్రశ్నలకుగాను ఒక్కో ప్రశ్నకు 5 ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఓఎంఆర్షీట్లో నాలుగు బబుల్స్ మాత్రమే ఉండడంతో స్టూడెంట్లు, టీచర్లు పరేషాన్ అయ్యారు. ముఖ్యంగా కరోనా టైంలో భయంభయంగా వచ్చి ఎగ్జామ్ రాసిన వేలాది మంది స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంగా మారింది.
110 సెంటర్లలో ఎగ్జామ్స్
కేంద్ర ప్రభుత్వం.. గవర్నమెంట్ స్కూళ్లలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతిభగల పేద స్టూడెంట్లకు నాలుగేళ్లపాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున స్కాలర్ షిప్ అందజేస్తోంది. ఇందుకోసం ఏటా టెన్త్స్టూడెంట్స్కు స్టేట్ లెవెల్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ), ఎనిమిదో తరగతి స్టూడెంట్స్ కు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ఎగ్జామినేషన్(ఎన్ఎంఎంఎస్ఈ) నిర్వహిస్తోంది. ఆయా స్టేట్సిలబస్కు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎగ్జామ్పేపర్లను తయారుచేసి నిర్వహించాలి. ఈ క్రమంలోనే ఆదివారం ఎన్ టీఎస్ఎగ్జామ్ను స్టేట్వైడ్ 141 సెంటర్లలో నిర్వహించగా, 20,978 మంది స్టూడెంట్స్కు గాను ఫస్ట్ ఎగ్జామ్మ్యాట్కు17,683 స్టూడెంట్లు, రెండో ఎగ్జామ్ సాట్ కు 17,653 మంది హాజరయ్యారు. ఇక ఎన్ఎంఎంఎస్ఈని 110 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా, 15,321 మంది స్టూడెంట్స్కుగాను 13,957 (91.10శాతం) మంది అటెండ్ అయ్యారు.
ఆఫీసర్ల నిర్లక్ష్యంతో స్టూడెంట్లు పరేషాన్
ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ఈ క్వశన్పేపర్కు సంబంధించి పార్ట్– ఏలో 90 ప్రశ్నలు, పార్ట్ –బీలో 90 ప్రశ్నలు ఉన్నాయి. ఈ180 ప్రశ్నలకు కింద ఉన్న ఆప్షన్స్లో సరైన ఆన్సర్ ఎంచుకొని ఓఎంఆర్ షీట్ లోని బబుల్స్ఫిల్చేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో ప్రతి క్వశ్చన్కింద 5 ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఓఎంఆర్ షీట్ లో నాలుగు బబుల్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో ఐదో ఆప్షన్ సరైన ఆన్సర్ అయినప్పుడు స్టూడెంట్స్ఆన్సర్ చేయలేకపోయారు. కొంతమంది ఓఎంఆర్షీట్లో ఐదో బబుల్గీసి, ఫిల్ చేస్తే ఇంకొందరు నాలుగో నంబర్లో ఆన్సర్ వేశారు. క్వశ్చన్పేపర్ చూసిన టీచర్లు కూడా ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు. కరోనా టైంలో భయంభయంగా వచ్చి పరీక్ష రాస్తే ఇలాంటి క్వశ్చన్పేపర్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చివరి నిమిషంలో పొరపాటును గుర్తించిన ఎడ్యుకేషన్ఆఫీసర్లు ఇప్పుడు ఓఎంఆర్షీట్ను మ్యాన్వల్గా దిద్దిస్తామని చెబుతున్నారు. అసలు ఐదో బబుల్అనేదేలేనప్పుడు మ్యాన్వల్గా దిద్దినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, మరోసారి ఎగ్జామ్ నిర్వహించాల్సి వస్తుందని టీచర్లు స్పష్టం చేస్తున్నారు.
స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు
ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ పార్ట్ఏలో ప్రతి క్వశ్చన్ కింద ఐదు ఆప్షన్లు ఇచ్చి, ఓఎంఆర్షీట్లో నాలుగు బబుల్స్ఇవ్వడంతో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓఎంఆర్ షీట్ ను సరిగ్గా అనాలసిస్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. మళ్లీ పరీక్షలు నిర్వహించక తప్పదు. లేదంటే 90 మార్కుల పార్ట్బీ ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్కు నష్టం జరగకుండా చూడాలి.– సీహెచ్. స్వామి, గవర్నమెంట్ టీచర్, తొర్రూరు
ఆన్సర్ ఎంపిక చేయలేక ఇబ్బంది పడ్డా
ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపిక కావాలని బాగా చదువుకొని వచ్చా. కానీ పార్ట్ఏ అంతా కన్ఫ్యూస్గా ఉంది. క్వశ్చన్ కింద ఐదు ఆప్షన్లు ఉన్నా ఓఎంఆర్ షీట్ లో నాలుగు బబుల్స్ మాత్రమే ఇచ్చారు. ఐదో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు బబుల్ ఫిల్ చేయలేకపోయా. కరోనా టైంలో భయంభయంగా వచ్చి పరీక్ష రాశా. ఇప్పుడు రద్దు చేస్తే మళ్లీ రావాలంటే మా పేరెంట్స్ పంపిస్తారో లేదో! – సాయి అలేఖ్య, 8వతరగతి, కంబాలపల్లి, మహబూబాబాద్
మ్యానువల్ వాల్యువేషన్ చేస్తం
ఆదివారం జరిగిన స్టేట్ లెవెల్ ఎన్టీఎస్ఈ, ఎన్ఎంఎంఎస్ఈ ప్రశాంతంగా ముగిశాయి. కానీ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లో ఐదు ఆప్షన్లకు గాను నాలుగు వచ్చినట్టు గుర్తించాం. దీంతో ఈసారి ఆన్లైన్ వాల్యువేషన్ కాకుండా, మ్యానువల్గా వాల్యువేషన్ చేయాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని జిల్లాలకు తెలియజేశాం. స్టూడెంట్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సత్యనారాయణరెడ్డి, పరీక్షల విభాగం డైరెక్టర్.
ఇవి కూడా చదవండి
రేషన్ కార్డులు లేవని లోన్లు ఇస్తలేరు
ఆర్టీఏ సేవలకు ఆధార్ తప్పనిసరి
వరి సాగులో ఆల్టైమ్ రికార్డ్
పర్మినెంట్ చేయరు.. జీతాలు పెంచరు