
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నార్కట్ పల్లి-అద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. చనిపోయినోళ్లలో చెరుపల్లి మహేశ్, ఆయన భార్య జ్యోతి, వాళ్ల ఇద్దరు పిల్లలు రిషిత, రియాన్షి, మరోవ్యక్తి మశ్చేంద్ర ఉన్నారని పోలీసులు తెలిపారు. మశ్చేంద్ర భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్కు చెందిన వారుగా గుర్తించారు. విజయవాడ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా ఈ ఘోరం జరిగింది.