తెలంగాణలో భారీగా లోన్లు ఇవ్వనున్న ఫ్లెక్సీలోన్స్

తెలంగాణలో భారీగా లోన్లు ఇవ్వనున్న ఫ్లెక్సీలోన్స్

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్ లెండింగ్ ప్లాట్‌‌ఫారమ్ ఫ్లెక్సీలోన్స్​ ఈ ఏడాది తెలంగాణలో భారీ సంఖ్యలో లోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ తెలంగాణలో 2024 వరకు మొత్తం మీద రూ. 200 కోట్లకుపైగా అప్పులు ఇచ్చింది. 

2024లో తెలంగాణ నుంచి 22 వేల దరఖాస్తులు వచ్చాయి.   ఎంఎస్​ఎంఈ రంగానికి పెద్ద ఎత్తున  వర్కింగ్ క్యాపిటల్ లోన్‌‌లు,  టర్మ్ లోన్‌‌లను అందించామని తెలిపింది. వీటిలో 70శాతం టోకు వ్యాపారులు,  రిటైలర్లు, 20శాతం సర్వీస్​ప్రొవైడర్లకు, 10శాతం తయారీదారులకు ఇచ్చామని  ఫ్లెక్సీలోన్స్ కో–ఫౌండర్​ మనీష్ లూనియా చెప్పారు.