ఓయూ లో ఫ్లెక్సీ లొల్లి.. విద్యార్థుల  మధ్య ఘర్షణ

 ఓయూ లో ఫ్లెక్సీ లొల్లి.. విద్యార్థుల  మధ్య ఘర్షణ

ఓయూ, వెలుగు: ఓయూలో ఫ్లెక్సీల లొల్లి  విద్యార్థి లీడర్ల మధ్య ఘర్షణకు దారి తీసింది.  మంగళవారం క్యాంపస్ లో నిర్వహించిన గణేశ్​నిమజ్జన ర్యాలీలో ఏబీవీపీ, ఎన్ఎస్​యూఐ , టీఎన్​ఏ విద్యార్థి లీడర్ల మధ్య గణేష్​ ఉత్సవాల  సందర్భంగా  ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో గొడవ మొదలైంది. తమ ఫ్లెక్సీలు చింపారంటే.. తమ ఫ్లెక్సీలు చింపారంటూ  ఏబీవీపీ స్టూడెంట్​లీడర్లు, ఎన్ఎస్​యూఐ ​,టీఎస్​ఏ లీడర్లతో గొడవ కు దిగారు. దీంతో  ఇరు గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి సరస్పరం దాడులు చేసుకున్నారు.

ఎన్ఎస్​యూఐ విద్యార్థి లీడర్​ చందు, టీఎస్ఏ నాయకుడు ఎన్ఎం శ్రీకాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఓయూ పోలీసులు చందు, శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని పీఎస్​కు తరలించారు. క్యాంపస్ లో  తమ ఫ్లెక్సీలను ఏబీవిపీ లీడర్లు చింపారని ఎన్ఎస్​యూఐ  విద్యార్థి లీడర్లు చెబుతుంటే, తమ ఫ్లెక్సీలను కాంగ్రెస్ విద్యార్థి సంఘ నాయకులు చింపుతుంటే అడ్డుకున్నామని,దీంతో తమపైనే వారు దాడికి పాల్పడ్డారని  ఏబీవీపి లీడర్లు చెప్తున్నారు.